రానా - మిహీకా బజాజ్ వివాహ వేదిక ఖరారు?

ఆదివారం, 21 జూన్ 2020 (10:34 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను త్వరలోనే పెళ్లాడనున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో వీరి వివాహం వచ్చే ఆగస్టు 8వ తేదీన జరుగనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా వీరి పెళ్లి వేదికను దగ్గబాటి ఫ్యామిలీ నిశ్చయించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరుగనున్నదట. పెళ్లి సెట్ రాయల్ థీమ్‌ను ప్రతిబింభించేలా ఉంటుందని, ఈ మొత్తం అరేంజ్ మెంట్స్‌ను మిహీక స్వయంగా పర్యవేక్షించనున్నారని సమాచారం. 
 
ఇక, కరోనా వ్యాప్తి కారణంగా ఈ పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే అతిథుల మధ్య రానా, మిహీకల పెళ్లిని వైభవంగా జరిపించాలని సురేశ్ బాబు, వెంకటేశ్‌లు భావిస్తున్నారట. అయితే, పెళ్లి వేదిక విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు