ఒక్కో సినిమాకు రూ.3కోట్లు డిమాండ్ చేస్తోన్న సాయిపల్లవి?

బుధవారం, 29 నవంబరు 2023 (13:55 IST)
ప్రేమమ్ సినిమాలోని మలర్ మిస్ రోల్ నటి సాయి పల్లవి కెరీర్‌లో పెద్ద మలుపు. తర్వాత సాయిపల్లవి సెలెక్టివ్ రోల్స్ ఎంచుకుంటుంది. ఇంకా సినిమాల్లో నటించేందుకు టేకప్ చేయాలంటే చాలా కఠినమైన షరతులు పెడుతుంది.
 
తాజాగా సాయిపల్లవి పారితోషికం ట్రెండింగ్‌గా మారింది. ఈ నటి కేవలం ఒక్క సినిమాకే కోట్ల పారితోషికం తీసుకుంటుంది.
 
సాయిపల్లవి గత ఏడాది విరాటపర్వం, గార్గి అనే రెండు చిత్రాల్లో కనిపించింది. తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. 
 
ఇందులో సాయి పల్లవి కథానాయిక. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాయి పల్లవికి భారీ పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకే కాదు.. కొత్త సినిమాల్లో సాయిపల్లవి సైన్ చేయాలంటే.. రూ.3కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు