ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా.. అతనితో కలిసి ఆ పని చేయను : నయనతార

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (14:32 IST)
నటనకు అధిక ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తమిళ అగ్రహీరోలు అజిత్, విజయ్ వంటి వారితోనే నటిస్తూ ముందుకు సాగిపోతున్న హీరోయిన్ నయనతార. అయితే, ఈమె చెన్నైలోని ప్రముఖ వాణిజ్య దుకాణాలు శరవణా స్టోర్స్ యజమాని శరవణన్‌తో కలిసి నటించనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. దీనిపై నయనతార మండిపడింది. 
 
ఇదే అంశంపై ఆమె సన్నిహితవర్గాల వద్ద ఆరా తీయగా, కథతో పాటు నటనకు అధిక ప్రాధాన్యత ఉండే చిత్రాల్లో మాత్రమే నయనతార నటించేందుకు సమ్మతిస్తోంది. కథ నచ్చలేదంటే.. హీరో ఎంతటివారైనా సరే అతనితో కలిసి నటించేందుకు నో చెపుతోందని తెలిపారు. అంతేకాకుండా, శరవణా స్టోర్ యజమాని శరవణన్‌తో కలిసి నయనతార నటిస్తుందా? అనే ప్రశ్నకు వారు సమాధానమిస్తూ.. ఎన్ని కోట్లు ఇచ్చినా అతని సరసన నటించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.  
 
కానీ, శరవణన్ మాత్రం తిరుచ్చెందూరు ఆలయానికి వెళ్లి రూ.కోటి విలువ చేసే బంగారు శూలాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలోనే తాను సినీరంగ ప్రవేశం చేయనున్నట్టు, తాను నటించే మొదటి చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుందని తెలిపారు. దీంతో శరవణన్‌తో నయనతార కలిసి నటిస్తుందనే ఊహాగానాలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి