కంగనా రనౌత్ హీరోయిన్గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'క్వీన్' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దీంతో ఈ సినిమాను దక్షిణాదిన తెరకెక్కించేందుకు.. తమిళ నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ అప్పట్లోనే ఈ మూవీ రీమేక్ రైట్స్ని దక్కించుకున్నాడు. హీరోయిన్ రేవతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి మరో సీనియర్ నటి సుహాసిని మణిరత్నం సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ భాషల్లో త్రిషకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమాను రెండు భాషల్లోనూ నిర్మించబోతున్నాడట త్యాగరాజన్. 'నాయకి' చిత్రాన్ని పూర్తిచేసిన త్రిష.. 'మోహిని' అనే టైటిల్పై లేడీ ఓరియెంటెడ్ పిక్చర్తో పాటు మరో సినిమాను కూడా ఒప్పుకుందట. ప్రస్తుతం చేస్తున్న రెండు ప్రాజెక్టులపై క్లారిటీ రాగానే.. ఈ ప్రాజెక్టు గురించి అందరికి తెలియజేస్తానంటోందీ ముద్దుగుమ్మ.