చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు యేడాది జైలు...

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:04 IST)
సినీ నటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబుకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. రూ.48 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. 
 
మోహన్‌ బాబుపై ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో పెట్టిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒక యేడాది జైలుతో పాటు రూ.41.75 లక్షల అపరాధం కూడా విధించింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఏ1గా ఆయన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్ పిక్చర్స్‌ ఉంటే, మోహన్ బాబు ఏ2గా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు