వయస్సు పైబడిన నటీనటులకు ఆదరణ లేదనేది సిని ఇండస్ట్రీలో తెలిసిందే. వీరి కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫించన్లు ఏర్పాటు చేసింది. అయితే మురళీ మోహన్ వుండగా.. వాటిని సరిగ్గా ఇవ్వలేదని కుదించారనే విమర్శలు వున్నాయి. ఆయన స్థానంలో వచ్చిన రాజేంద్రప్రాసద్ ఫించన్లపై శ్రద్ధ పెట్టాడు. దానికి అనుగుణంగా ఇటీవలే కొంతమందికి ఫించన్లు ఇచ్చాడు. పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో... స్టేజీ ఆర్టిస్టు నాగయ్య చేరాడు.