హీరో సూర్య ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..?

శుక్రవారం, 12 జూన్ 2020 (22:38 IST)
తమిళ హీరో సూర్య కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించిన సూర్య కెరీర్ లో మరచిపోలేని విభిన్న కథా చిత్రం అంటే 24 మూవీ అని చెప్పచ్చు. ఈ సినిమాకి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.
 
టైమ్ మిషన్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. విభిన్న గెటప్‌లో కనిపించిన సూర్య పాత్రకు మంచి స్పందన లభించింది.
 
 అయితే... ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. మరోసారి టైమ్ మిషన్ నేపధ్యంతో సినిమా చేయనున్నాడు అని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
తాజాసమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. అయితే.. దర్శకుడు విక్రమ్ కుమారేనా..? లేక వేరే డైరెక్టరా..? అనేది తెలియలేదు కానీ 24 మూవీకి సీక్వెల్ తీయడం మాత్రం కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సీక్వెల్ సూర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో? 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు