వరుసగా చేదు వార్తలే.. బాలీవుడ్‌కు ఏమైంది..? శిఖా మల్హోత్రాకు..?

శనివారం, 12 డిశెంబరు 2020 (13:41 IST)
Shikha Malhotra
బాలీవుడ్ చిత్ర సీమకు సంబంధించిన నటీనటులు వార్తల్లో నిలుస్తున్నారు. అదీ బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మరీ ఎక్కువ. డ్రగ్స్ వ్యవహారంలో చాలామందితో విచారణ జరిగిన సంగతిని పక్కన బెడితే.. తాజాగా బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నటి శిఖా మల్హోత్రా పక్షవాతానికి గురయ్యారు. 
 
నర్సింగ్ కోర్సు చేసిన శిఖా లాక్‌డౌన్ సమయంలో కరోనా రోగులకు ఆరు నెలల పాటు స్వచ్ఛందంగా సేవలందించారు. ఈ క్రమంలోనే అక్టోబరులో ఆమెకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో కొద్దిరోజుల క్రితమే ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు పక్షవాతం రావడంతో బాలీవుడ్ ఉలిక్కి పడింది. శిఖా మల్హోత్రా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి 'ఫ్యాన్‌' సినిమాలో నటించారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం శిఖా మల్హోత్రా శరీరం కుడివైపు కాళ్లు, చేతులు తీవ్రంగా ప్రభావితం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శిఖాకు నెల రోజుల క్రితం పక్షవాతం సోకడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి క్రమంగా కోలుకున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలోనే పక్షవాతం రావడం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
'శిఖా మల్హోత్రాకు పక్షవాతం రావడంతో కుడివైపు శరీరం తీవ్రంగా ప్రభావితమైంది. ఆమెను విలేపార్లేలోని కూపర్ ఆసుపత్రిలో చేర్చాం' అని ఆమె మేనేజరు అశ్వని శుక్లా తెలిపారు. శిఖా ప్రస్తుతం చికిత్స పొందుతోందని, కనీసం మాట్లాడలేకపోతోందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు