నా సినిమాకు నేనే లేట్‌గా వెళ్లా.. ఫస్ట్ కాల్ ఆ హీరో నుంచి వచ్చింది.. అడివి శేష్

సోమవారం, 5 డిశెంబరు 2022 (14:22 IST)
అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం "హిట్-2". ఈ నెల 2వ తేదీన విడుదలైంది. విడుదలైన తొలి రోజునే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో చిత్రం బృందం సెలెబ్రేషన్స్‌లో మునిగిపోయింది. 
 
ఇందులో హీరో అడివి శేష్ మాట్లాడుతూ, "ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందా అని నేను చాలా టెన్షన్‌కు లోనయ్యాను. ఉదయాన్నే నిద్రలేవగానే హీరో మహేశ్ బాబు నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే ఆయనకు నేను కాల్ చేశాను.. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్ అంటూ కితాబిచ్చారు. 
 
ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రసాద్ ఐమ్యాక్స్‌కు వెళ్లాను. ట్రాఫిక్ జామ్ వల్ల నా షోకి నేనే ఆలస్యంగా వెళ్లాను. థియేటర్ రెస్పాన్స్ చూసి షాక్‌ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఇంతమంది సపోర్టు చేయడం కంటే నాకు కావల్సిందేం ఉంటుంది' అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు