అల్లు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం... అల్లు అర్జున్ ట్వీట్

గురువారం, 15 జులై 2021 (15:39 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈయన కుమార్తె అల్లు అర్హ. ఇపుడు అర్హ వెండితరపై కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న 'శాకుంతలం' సినిమాలో అర్హ కూడా నటిస్తోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 
 
"అల్లు వారి కుటుంబం నుంచి నాలుగో తరం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం పట్ల గర్వంగా ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 'శాకుంతలం' మూవీ ద్వారా అల్లు అర్హ సినిమా రంగంలో ప్రవేశిస్తోందని వివరించారు. 
 
ఇంతటి చక్కని సినిమా ద్వారా తన కుమార్తెను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు దర్శకుడు గుణశేఖర్, నీలిమ గుణలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, 'శాకుంతలం' సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించనుంది. శకుంతల, దుష్యంతుల కుమారుడే భరతుడు. శకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని గుణశేఖర్ 'శాకుంతలం' చిత్ర ఇతివృత్తంగా తీసుకున్నారు. 
 
ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది . దుష్యంతుడిగా కేరళ యాక్టర్ దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 
 

A proud moment for the Allu family to announce that the fourth generation, #AlluArha will be making her debut with #Shakuntalam movie. I want to thank @Gunasekhar1 garu & @neelima_guna garu for giving my daughter this beautiful movie as her debut . pic.twitter.com/iPfXQaqJCk

— Allu Arjun (@alluarjun) July 15, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు