ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చినవారంతా అమీర్పేటకు రావాల్సిందే. ఆ పేరు వినగానే గుర్తుకువచ్చేది పాంప్లెట్లు, బ్యానర్లు, ట్రైనింగ్ ఇన్న్సిటూట్లూ, రద్దీగా ఉండే జనం. చాలామంది యువతీ యువకులు ఆలోచనలు అక్కడకి రాగానే మారిపోతుంటాయి. చాలామంది కెరీర్ కోసం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ సక్సెస్ సాధిస్తే.. మరికొందరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని అనుకుంటారు. ఆ పక్కనే వున్న సారధీ స్టూడియోస్ రా రమ్మని పలుకరిస్తుంది. అలా దానికి ఆకర్షితుడైన హీరో కథతో 'అమీర్పేటలో' చిత్రం రూపొందింది. అక్కడే కొన్నాళ్ళు జనాలను పరిశీలించి తీసిన సినిమా ఇది.
ఈష, రాజు, తిలక్, రాజశేఖర్, శేఖర్ తదితరులు తారాగణంగా నటించారు. పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్పై యామిని బ్రదర్స్ సమర్పణలో మహేష్ మందలపు నిర్మాణ సారథ్యంలో శ్రీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించరు. శ్రీ, అశ్విని హీరోయిన్గా నటించారు. ఏడాదిపైగా పూర్తయిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మయూరి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ముందుకు వచ్చింది. ఈనెల 16న విడుదల చేస్తుంది.
హీరో, దర్శకుడు శ్రీ మాట్లాడుతూ.. మమూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వారి సహకారంతో సినిమాను విడుదల చేస్తున్నాం. వంశీ, ప్రవీణ్ సహకారాన్ని మరచిపోలేను. ఏ దర్శకుడు అయినా కథ రాసుకున్న తర్వాత అతనికి మంచి టీం సహకారం ఉండాలి. అలాంటి మంచి టీం నాకు దొరికింది. మురళి, అశ్విని, నిర్మాత మహేష్ సహా టీం అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అమీర్ పేట అనగానే మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తుంటాయి. అలా అమీర్పేటలోని జీవితాలను చూపిస్తూనే, మంచి కథను తెరపై చూపించబోతున్నాం. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడ ఉన్న సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.