మన్మథుడుకి "కంపెనీ" ఇవ్వనున్న దేవసేన

శనివారం, 25 నవంబరు 2017 (15:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం "శివ". ఈ చిత్ర కాంబినేషన్ 28 యేళ్ళ తర్వాత మళ్లీ రిపీట్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ - హీరో నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'కంపెనీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. 
 
అయితే, హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతికవర్గం, నటీటుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు. కానీ, హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ మన్మథుడు సరసన హీరోయిన్‌గా దేవసేన అనుష్కను ఎంపిక చేయనున్నారనే వార్త వైరల్‌గా మారింది. అదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత ఆమె కమిట్‌ అయ్యే సినిమా ఇదే అవుతుంది. 
 
మరోవైపు, నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ ముంబైలో ఉంటుంది. ఈ సినిమాలో డ్యూయెట్లు కానీ, లవ్‌ సీన్లు కానీ ఉండవని అంటున్నారు. అయితే ఓ ఐటెం సాంగ్‌ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. హీరోయిన్‌కు నాగార్జునతో లవ్‌ ట్రాక్‌ ఉండదని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు