బిగ్ బాస్-3: శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఎఫెక్ట్.. స్టార్ మాకు నోటీసులు..

బుధవారం, 24 జులై 2019 (11:38 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ తెలుగు రియాల్టీ షో ప్రారంభం కాకముందే.. స్టార్ మా టీవీ నిర్వాహకులపై నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో కోసం ఎంపిక చేసే ప్రక్రియలో లొసుగులు వున్నాయని.. వారిద్దరూ ఆరోపించారు. ఇంకా బిగ్ బాస్‌ను సంతృప్తి పరచాలని నిర్వాహకులు కోరుతున్నారని గాయత్రి మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించి మా టీవీకి పోలీసులు నోటీసులు పంపారు. బిగ్‌బాస్-3 పేరుతో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ యాంకర్ శ్వేతారెడ్డి ఇటీవల చేసిన ఫిర్యాదుకు బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. శ్వేతారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా స్టార్ మా టీవీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 
 
ఈ నోటీసుల్లో చానల్ యాజమాన్యానికి ఆరు ప్రశ్నలు సంధించారు. అగ్రిమెంట్‌ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు, శ్యాం, మిగిలిన ముగ్గురి పాత్రకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. నోటీసులు అందుకున్న స్టార్‌ మా చానల్‌ సంస్థ అడ్మిన్‌ హెడ్‌ శ్రీధర్‌.. యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని పోలీసులకు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు