గంగవ్వకు కెప్టెన్సీనా.. ఐపీఎల్‌తో పోటీపడనున్న బిగ్ బాస్ 4..?

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (15:27 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ టీఆర్పీ రేటింగ్ కాస్త తగ్గిన నేపథ్యంలో.. ఐపీఎల్‌తో పోటీ పడేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ పోటీని తట్టుకునేందుకు దూకుడు పెంచాడు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్‌కు అద్భుతమైన టాస్క్స్‌ ఇచ్చి. . ఇంట్లో సెగలురేపుతూ.. బయటి ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. నిన్న మొన్న జరిగిన 'ఉక్కు హృదయం; టాస్క్‌ రసవత్తరంగా జరిగింది. 
 
రోబోలు, హ్యూమన్స్‌గా విడిపోయిన సభ్యులు గేమ్‌లో లీనమయ్యి.. ఆకట్టుకున్నారు. మనుషుల ఆవేశం.. రోబోల ప్రశాంతం.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రోబో జట్టు మైండ్ గేమ్ ఆడి హ్యూమన్స్‌పై విజయం సాధించారు.
 
ఇక హ్యూమన్స్ జట్టులో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన నోయెల్‌ను బిగ్ బాస్.. జైల్లో పెట్టాడు. అతడికి రాగి జావ, పళ్లు తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలు, పానీయాలు ఇవ్వకూడదని హౌస్ సభ్యులను ఆదేశించాడు. విజేతగా నిలిచిన రోబో జట్టులో ముగ్గురు అద్భుత ప్రదర్శన చేసినట్లు మిగతా సభ్యులు చెబుతారు. వారే అభిజీత్, అవినాష్, గంగవ్వ, హారిక. ఈ నలుగురిలో ఒకరు కెప్టెన్‌గా ఎంపికవుతారు. 
 
దానికి సంబంధించిన టాస్క్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. 'రంగు పడుద్ది.. జాగ్రత్త' పేరుతో ఈ టాస్క్‌ ఇవాళ జరగబోతోంది. బిగ్ బాస్ కెప్టెన్ పదవి కోసం కుర్రాళ్లు అభిజీత్, అవినాష్, హారికతో తలపడుతోంది గంగవ్వ. మరి వారిని ఓడించి కెప్టెన్‌గా ఎంపికవుతుందా? లేదా? తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు