కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించిన కరీనా - భర్త ఆచూకీ చెప్పని నటి

బుధవారం, 15 డిశెంబరు 2021 (07:38 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన బాలీవుడ్ నటి కరీనా కపూర్ కాంటాక్ట్ ట్రేసింగ్‌కు ఏమాత్రం సహకరించడం లేదని బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త, బాలీవుడ్ నటు సైఫ్ అలీ ఖానీ ఆచూకీ వివరాలను చెప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, బీఎంసీ అధికారులు చేస్తున్న ఆరోపణలను కరీనా కపూర్ కొట్టిపారేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కోవిడ్ బారినపడిన కరీనాకపూర్ నివసిస్తున్న ఇంటిని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. అలాగే, ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే, తనను కాంటాక్ట్ అయిన భర్తతో పాటు ఇతరు ఆచూకీ వివరాలను చెప్పేందుకు ఆమె నిరాకరించడం లేదు. 
 
సైఫ్ అలీ ఖాన్ గురించి ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతోందని వారు అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతుందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు