సినీ నటి రాధిక నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం

ఆదివారం, 1 మే 2022 (22:22 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే "ఆచార్య" ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత గాఢ్‌పాదర్, భోళా శంకర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. చిరంజీవి 154వ చిత్రంగా వాల్తేరు వీరయ్యగా మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ఇపుడు మరో చిత్రానికి ఆయన కమిట్ అయినట్టు సమాచారం. 
 
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నిర్మాతగా చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాధిక వెల్లడించారు. తమ బ్యానరులో హీరోగా నటించేందుకు చిరంజీవి సమ్మతించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు. 
 
కాగా గతంలో చిరంజీవి, రాధిక జోడీ విజయవంతమైన జోడీగా పేరుగాంచిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో రాధిక సొంత నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే చిత్రంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు