తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌

గురువారం, 16 సెప్టెంబరు 2021 (19:49 IST)
Dasari-YS jagan
ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, నిర్మాత‌, రామ‌దూత క్రియేష‌న్స్ అధినేత‌ దాస‌రి కిర‌ణ్ కుమార్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని టీటీడి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి మ‌రియు మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాలశౌరిగారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 
 
దాసరి కిరణ్ కుమార్ వంగవీటి, సిద్ధార్థ వంటి ప్రముఖ సినిమాలను నిర్మించారు..దాసరి కిరణ్ గతంలో థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2016 వంగవీటి. కొన్ని సినిమాల‌కు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు