ఈ సందర్భంగా తాజా చిత్రం, రూ.300 కోట్ల క్లబ్లో చేరిన 'కబాలీ' 100 రోజుల సెలబ్రేషన్స్ను సైతం అభిమానులు సందడిగా జరుపుకున్నారు. వచ్చే సంవత్సరం రోబో సీక్వెల్ '2.0' విజయంతో దీపావళిని జరుపుకుంటామని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.
అంతకుముందు రజినీకాంత్ దీపావళి పండుగను తన అల్లుడు, తమిళ హీరో ధనుష్, మనువడు, కుమార్తె ఐశ్వర్య, సౌందర్యలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.