అయితే సినీ ఇండస్ట్రీలో రాఖీ కట్టడం.. తర్వాత వారినే పెళ్లాడటం సహజమని సినీ పండితులు అంటున్నారు. ఈ కోవలోనే బాలీవుడ్ జంట శ్రీదేవి-బోనీ కపూర్ల వివాహం జరిగిందంటున్నారు. శ్రీదేవి తాను అగ్రనటిగా కొనసాగిన తరుణంలో బోనీ కపూర్కు రాఖీ కట్టింది. ఆపై ప్రేమలో పడిన ఈ జోడీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ఏకంగా తన తొలి భార్యకు విడాకులిచ్చి మరీ శ్రీదేవిని మనువాడారు.