సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం "నేనోరకం". ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్దమైంది. కాగా రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం సాంగ్ టీజర్ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, 'నేనోరకం' టీజర్, సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. చిత్ర యూనిట్కు నా అభినందనలు. సాయి రామ్ శంకర్ కెరీర్లో "నేనోరకం" బెస్ట్ మూవీ అవుతుందన్నారు.
ఇకపోతే సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ, 'నేనోరకం' సాంగ్ టీజర్ను దేవిశ్రీ ప్రసాద్ లాంఛ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. కాంటెపరరీ ఇష్యూస్ను స్ఫూర్తిగా తీసుకొని, ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు.
రేష్మి మీనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎం.ఎస్ నారాయణ, ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాథ్, పృథ్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్.