పడుచు అమ్మాయిలపైనే దర్శకులు చూపు : దియా మీర్జా

ఆదివారం, 24 జూన్ 2018 (12:39 IST)
బాలీవుడ్ నటి దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఖల్‌నాయక్ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దియా మీర్జా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ పాత్రలో దియా మీర్జా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత దర్శక నిర్మాతల చూపంతా యంగ్ హీరోయిన్లపైనే ఉందని వ్యాఖ్యానించింది.
 
ముఖ్యంగా, కథానాయికలు నటపరంగా ఎంతో ఆకట్టుకున్నా కూడా ఆ హీరోయిన్ వయసు 30 దాటిందంటే చాలు అవకాశం ఇవ్వడానికి ఏ డైరెక్టర్ ముందుకు రావటం లేదని వాపోయింది. ప్రధానంగా దర్శకనిర్మాతల చూపంతా పడుచు అమ్మాయిలపైనే కేంద్రీకృతమైవుందని అభిప్రాయపడింది. 
 
తమ సినిమాల్లో నటించేందుకు వారికే అవకాశం ఇస్తున్నారే.. తప్ప సీనియర్ హీరోయిన్ వైపు చూడటం లేదు. కాస్త వయసు పైబడినంత మాత్రాన నటనకు పనికిరామా? అంటూ తన ఆవేదన వెళ్లబుచ్చుతూనే.. రానురాను సినిమా రంగంలో మార్పులు గమనిస్తున్నాం.. మరి హీరోయిన్స్ పర్సనల్ లైఫ్‌లో మార్పులు రాకూడదా? అని ఆమె ప్రశ్నిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు