మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌కు కరోనా పాజిటివ్

గురువారం, 20 జనవరి 2022 (22:55 IST)
మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్‌కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. వారం రోజుల గ్యాప్ లోనే తండ్రికొడుకులిద్దరూ కరోనా బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాను కరోనా బారిన పడినట్లు దుల్కర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. "నాకు ఇప్పుడే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కొద్దిగా జలుబు తప్ప నేను బాగానే ఉన్నాను. నేను ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నాను. 
 
ఇటీవల కాలంలో ఎవరైతే నాతో పాటు షూటింగ్ సెట్ లో కలిసి ఉన్నారో వారందరు ఐసోలేషన్‌లో ఉండండి.. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి. ఈ పాండమిక్ ఇంకా అవ్వలేదు.. అందరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి అందరు మాస్క్ ధరించండి.. సేఫ్‌గా ఉండండి.." అంటూ చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు