తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన ఈ జంట మద్యం మత్తులో ఉన్నట్లు, తప్పుడు రైలు ఎక్కారని పోలీసులు తెలిపారు. "ఆ మహిళకు కోయంబత్తూర్కు టికెట్ ఉంది, కానీ ఆమె పడిపోయిన రైలు టికెట్ ఆమె చేతుల్లో లేదు" అని తనూర్ పోలీసు అధికారి తెలిపారు.
సదురు మహిళ తనూర్ సమీపంలో పడిపోయింది. ఆమె భర్త పరప్పనంగడి స్టేషన్లో దిగి స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో, ఆ మహిళకు గాయాలు ఉన్నప్పటికీ, సమీపంలోని ఇంటికి చేరుకుంది. నివాసితులు పోలీసులను సంప్రదించారు.