దీపికా నివాసముండే అపార్ట్‌మెంట్లో అగ్ని ప్రమాదం.. 95మంది సేఫ్

బుధవారం, 13 జూన్ 2018 (17:08 IST)
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే జోడి వివాహం చేసుకోనుందని బీటౌన్ గుసగుసలాడుకుంటోంది. ఈ ఏడాది చివరికల్లా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌‌కే ఈ జోడీ మొగ్గుచూపుతోందని.. వివాహానంతరం ముంబై, బెంగళూరులలో రెండు భారీ రిసెప్షన్‌‌లను కూడా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే నివాసం వుంటున్న ముంబయిలోని వర్లి ప్రాంతంలోని 45 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
 
33వ అంతస్తులో మంటలు చెలరేగడంతో దానిపై భాగంలో ఉన్న ఫ్లాట్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఈ టవర్‌లోనే దీపికా పదుకునే ఫ్లాట్ కూడా వుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 
 
ఈ ఘటనపై దీపికా స్పందిస్తూ.. తాను సురక్షితంగా వున్నానని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని ట్విట్టర్లో వెల్లడించింది. ఇంకా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదని.. రెండు అంతస్తుల వరకు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు