బిగ్ బాస్-2 విజేత కౌశల్‌కు పీఎమ్ ఆఫీసు నుంచి కాల్ రాలేదట..

గురువారం, 15 నవంబరు 2018 (16:35 IST)
బిగ్ బాస్-2 విజేత కౌశల్ చెప్పినవన్నీ గాలి మాటలేనా..? అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్-2 విజేతగా నిలిచిన కౌశల్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. తనకు ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్‌లో మాట్లాడారని చెప్పాడు. 
 
ఓ రియాల్టీ షోలో గెలుపొందిన కారణంగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. కౌశల్ ఫ్యాన్స్ మాత్రం పొంగిపోయారు. కానీ అసలు ఈ విషయంలో ఎంత నిజముందనే దానిపై ఓ వ్యక్తి.. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ దరఖాస్తుపై స్పందించిన సమాచార హక్కు చట్టం అధికారులు అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశారు. దీంతో కౌశల్ చెప్పిన మాటల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. 
 
ఇదే విధంగా గిన్నిస్ బుక్ రికార్డ్ వాళ్లు కూడా తనను సంప్రదించారని కౌశల్ చెప్పుకొచ్చాడు. వారికి 40కోట్ల ఓట్ల గురించి ఛానల్‌లో వాళ్లని అడిగి ఆధారాలు చూపిస్తానని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఈ విషయాలు తెలుసుకున్న కౌశల్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతనిని ట్రోల్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు