గుంటూరు వేదికగా జరిగిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నటుడు నాగబాబు ఇద్దరిపై మాటలతూటాలు పేల్చాడు. ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్ కాగా, మరొకరు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. వీళ్లద్దిరిని వాడు.. వీడు అంటూ సంబోధించాడు. అంతేనా... కుసంస్కారి, అక్కుపక్షి అంటూ ఘాటైన పదజాలాన్ని వాడాడు.
దీనిపై నెటిజన్లతో పాటు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు తమదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాంగోపాల్ వర్మ శ్రుతిమించుతున్నాడని మెగా ఫ్యాన్స్ అంటుంటే, వర్మకు మద్దతుగానూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. తన అన్న మెగాస్టార్ అని చెప్పి, వాడు వీడు అంటుంటే, సైలెంట్గా ఉండటానికి రాంగోపాల్ వర్మ వేరెవరి ఫ్యానో కాదని అంటున్నారు.