#HBDAnushkaShetty జేజమ్మకు పుట్టినరోజు విషెస్ : 48వ చిత్రంపై కీలక ప్రకటన

ఆదివారం, 7 నవంబరు 2021 (11:50 IST)
టాలీవుడ్ జేజమ్మగా ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసుకున్న అనుష్క... తన పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని తన 48వ చిత్రంపై కీలక ప్రకటన చేశారు. 
 
ఒకవైపు, హీరోయిన్‌గా న‌టిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ ముద్దుగుమ్మ చివ‌రిగా "నిశ్శ‌బ్ధం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె త‌దుప‌రి సినిమా కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ రోజు అనుష్క బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె 48వ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.
 
ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు.పి డైరెక్షన్‌లో అనుష్క 48వ చిత్రాన్ని చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా యు వి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటికే అనుష్క రెండు సినిమాలు చేసింది. మిర్చి, భాగ‌మ‌తి త‌ర్వాత ఇప్పుడు యువీ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి హ్యాట్రిక్ మూవీ చేస్తుంది. ఇది కూడా లేడి ఓరియెంటెడ్ మూవీగానే తెరకెక్కుతుంది. 
 
ఇందులో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నాడని టాక్. ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు