ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే - డా.మంచు మోహ‌న్‌బాబు

శుక్రవారం, 24 మే 2019 (15:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందించారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌హుశా ఎవ‌రు ఊహించి ఉండ‌రేమో అనిపిస్తుంది. ఎందుకంటే జ‌గ‌న్ పార్టీ 175 స్ధానాల‌కు 151 స్ధానాల్లో గెలుపు సాధించ‌డం అంటే మామూలు విషయం కాదు. ఇంత‌కు ముందు ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేదు. బ‌హుశా ఇక ముందు కూడా ఇలా జ‌ర‌గ‌దేమో. ఇదొక చ‌రిత్ర‌ అని సినీ హీరో డాక్టర్ మంచు మోహన్ బాబు అన్నారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి డా.మోహ‌న్ బాబు స్పందిస్తూ... ప్రజల తీర్పు ఎప్పుడూ1 గొప్పదే. వైఎస్.రాజశేఖర్ రెడ్డి తన బిడ్డ జగన్‌కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేశారు. ఖ‌చ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని తెలియ‌చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు