మ‌ళ్లీ చెప్తున్నా ఈ క్రిస్ట‌మ‌స్ మాత్రం మ‌న‌దే - నాని

బుధవారం, 15 డిశెంబరు 2021 (12:47 IST)
Sai Pallavi, Nani, Kriti Shetty
న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మంగళ వారం నాడు వరంగల్‌లో శ్యామ్ సింగ‌రాయ్ రాయల్ ఈవెంట్లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిపారు.
 
నాని మాట్లాడుతూ.. ‘కళ్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం. ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో మంత్రి దయాకర్ గారు అంతా చూసుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలంతా కూడా సుమ డేట్ల గురించి ఎదురుచూస్తుంటారు. అదే మీరు.. అదే నేను.. అదే పల్లవి.. అంతకు మించిన రిజల్ట్ ఈ 24న చూడబోతోన్నారు. ఎంసీఏ బ్లాక్ బస్టర్ కదా? అని ఇక్కడకు  రాలేదు. ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఉంది.. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు.. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. ఆ సినిమా చూసి నేను డిసైడ్ చేయకూదని అనుకున్నాను. కానీ  ఈ రోజు  నా సినిమాను చూశాను. టాలీవుడ్  టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. ఇది నాకు సొంత బ్యానర్‌లా ఉంది. ఇలా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మా ప్రయాణం మొదలవ్వడం ఆనందంగా ఉంది. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. 
 
సాయి పల్లవి నుంచి మీరు ఎంత డ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే. ఈ పాత్రను అర్థం చేసుకుంటుందా? లేదా? అని అనుకున్నాను. కానీ ప్రతీ రోజూ సెట్‌లో ఆమె తన పాత్ర కోసం కేర్ తీసుకునేది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఆమె పాత్ర ఎంతో బాగుంటుంది. అరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉందిరా అని అనేవారు. ఆయనకు ఆ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు