దుమ్ము దులుపుతున్న 'ఇస్మార్ట్ శంకర్'.. మరో 'పోకిరి' అవుతుందా?

గురువారం, 1 ఆగస్టు 2019 (13:30 IST)
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "ఇస్మార్ట్ శంకర్". ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా మొదటి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుంది. ఫలితంగా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. దీనికితోడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "డియర్ కామ్రేడ్". ఈ చిత్రం తాజాగా విడుదలైనప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అదేసమయంలో విడుదలైన ఇతర సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోవడం 'ఇస్మార్ట్ శంకర్‌'కు కలిసివచ్చింది. 
 
దీంతో 'ఇస్మార్ట్ శంకర్' కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం గత 12 రోజుల్లోనే ఏకంగా 65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేయగా, రూ.30 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. ముఖ్యంగా, ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మేరకు వసూళ్లను సాధించి హీరో రామ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. 
 
నిజానికి పూరీ జగన్నాథ్‌కు గత కొన్ని నెలలుగా సరైన హిట్ లేకపోవడంతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో రామ్‌ హీరో సీనియర్ హీరోయిన్ చార్మి సహ నిర్మాతగా 'ఇస్మార్ శంకర్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పూరీ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా, గతంలో పూరీ - మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం తరహాలో వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు