పసుపు రంగు చీరలో బాగున్నానా.. రష్మిక మందన్న కొత్త నిర్ణయం?

గురువారం, 7 సెప్టెంబరు 2023 (15:08 IST)
Rashmika
టాప్ హీరోయిన్ అయిన రష్మిక మందన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమెకు ఇన్‌స్టాలో 39 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఫ్యాషన్ డ్రెస్‌లలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 
అయితే, తన అసిస్టెంట్ సాయి పెళ్లిలో ఆమె చీరలో మెరిసింది. ఆ చీరలో ఆమె లుక్ సూపర్ అంటూ  అభినందనలు అందుకున్న తర్వాత, ఇక చీరలు కూడా అప్పుడప్పుడు ధరించాలని చెప్పింది. 
 
"నేను ఇక నుండి మరిన్ని చీరలు ధరించడం ప్రారంభిస్తానని అనుకుంటున్నాను. చీరలో కంపర్ట్‌గా వున్నాను" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసింది.
 
ఇంకా పసుపు చీర ధరించిన ఫోటోను పంచుకుంది. ఈ విషయంపై ఆమె తన ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప2, రెయిన్ బో, ధనుష్ 51వ సినిమాలో నటిస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు