చిరంజీవితో ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి సినిమాలు తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇటీవల ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను డైరెక్టర్ వీవీ వినాయక్తో కలిసి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నా చిరంజీవి నటనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఈ వయసులో కూడా ఇలా నటించగల నటులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారన్నారు.
చిరంజీవి మరిన్ని సినిమాలు చేసి అభిమానులను అలరించాల తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అలాగే చిరంజీవిని తెరపై అందంగా, మాస్ కింగ్గా చూపించిన దర్శకుడు వినాయక్ను కూడా విశ్వనాథ్ ప్రశంసించారు. దిగ్గజ దర్శకుడి నుంచి కితాబులు అందుకోవడంతో వినాయక్ చాలా హ్యాపీగా ఉన్నాడు.