బాలీవుడ్ రింగు జుట్టుల సుందరి కంగనా రనౌత్ నటించిన రంగూన్ సినిమా ఈ నెల 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజీ బిజీగా ఉంది కంగనా రనౌత్. ఈ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కంగనా రనౌత్.. మీడియాతో టాలీవుడ్ ప్రేక్షకులకు తనకున్న సంబంధాలను పంచుకుంది.
బాహుబలి-2 ప్రభాస్తో తాను గతంలో పడిన గొడవ గురించి చెప్పింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘ఏక్నిరంజన్’ సినిమాలో ప్రభాస్తో కలిసి కంగనా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా చేసే సమయంలో ప్రభాస్కు, తనకు మధ్య పెద్ద గొడవైందని చెప్పింది. దీంతో తమ ఇద్దరి మధ్య మాటల్లేకుండా పోయాయని, అప్పటి నుంచి అతనితో తాను టచ్లో లేనని వెల్లడించింది.