బాంబే నుంచి సిమ్లాకు బదిలీ చేయండి.. : సుప్రీంలో కంగనా పిటిషన్

మంగళవారం, 2 మార్చి 2021 (16:54 IST)
బాంబేలో తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల విచారణను హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని సిమ్లాకు బదిలీ చేయాలని కోరుతూ బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 
 
బాంబేలో కేసుల విచారణకు హాజరుకావడం తన ప్రాణానికి ముప్పు అని, శివసేన నేతల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని కంగన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అందువల్ల బాంబే కోర్టుల్లో తనపై ఉన్న మూడు కేసులను తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేయాని న్యాయస్థానాన్ని కోరారు. నటి తరపున న్యాయవాది నీరజ్‌ శేఖర్‌ ఈ పిటషన్‌ దాఖలు చేశారు. 
 
సోషల్‌మీడియాలో మతపరమైన విమర్శలు చేసినందుకుగానూ కంగన, ఆమె సోదరిపై రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 
 
వీటితో పాటు నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రముఖ రచయిత‌ జావెద్‌ అక్తర్‌ ఆమెపై పరువునష్టం దావా వేశారు.
 
ఈ కేసులను కొట్టివేయాలంటూ గతంతో కంగన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూలమైన తీర్పు రాకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు