బాలీవుడ్‌లో కీర్తి సురేష్ ఎంట్రీ, ఏ మూవీలో న‌టిస్తుందో తెలుసా..?

గురువారం, 14 మార్చి 2019 (22:16 IST)
నేను శైల‌జ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన‌ కీర్తి సురేష్...తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆత‌ర్వాత నేను లోక‌ల్ సినిమాతో మ‌రో విజయం ద‌క్కించుకుంది. ఈ రెండు చిత్రాలు స‌క్స‌స్ సాధించ‌డంతో ఏకంగా ప‌వన్ స‌ర‌స‌న అజ్ఞాత‌వాసి సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్నా...ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఇక కీర్తి సురేష్ కి అవ‌కాశాలు రావు అనుకున్నారు కానీ..మ‌హాన‌టి సినిమా కీర్తి సురేష్ కెరీర్ ని మార్చేసింది.
 
ఇప్పుడు సూపర్ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ జోడీగా వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంది. అవును. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా రూపొందే సినిమాలో ప్రధాన పాత్రను అజయ్ దేవ్‌గణ్ పోషించేందుకు సిద్ధమవుతున్నాడు.
 
బధాయీ హో ఫేం అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో దేవ్‌గణ్ జోడీగా నటించే తార కోసం చేసిన అన్వేషణలో కీర్తి సరైన నటి అని నిర్ధారించుకున్నాడు అమిత్. మ‌రి..బాలీవుడ్ లో కూడా స‌క్స‌స్ సాధిస్తుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు