లక్ష్మీమంచు స్వచ్ఛభారత్కు చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటికే ప్రధాని చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్కు అద్భుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని పరిశుభ్రం చేయాలని శ్రమించారు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్ 10న రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖుల మధ్యలో రాష్ట్రపతి ఆమెను గౌరవించనున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మిమంచు మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం మరింత బాధ్యత పెంచింది.