దసరా కానుకగా మహాసముద్రం.. ట్రైలర్ విడుదల (Video)

గురువారం, 23 సెప్టెంబరు 2021 (18:43 IST)
Maha Samudhram
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి చేస్తున్న సినిమా మహాసముద్రం. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. ఈ సినిమా కథ పట్టుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు అజయ్. 
 
ఎట్టకేలకు శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ సినిమానుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంటెన్స్‌ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ గురువారం విడుదలైంది. 
 
ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ , శరణ్య కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు