మరువ తరమ నుంచి పరవశమే.. మెలోడీ పాట విడుదల

డీవీ

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:13 IST)
Advait Dhanunjaya - Atulya
ఓ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'మరువ తరమా'  రాబోతోంది. అద్వైత్ ధనుంజయ  హీరోగా  అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. 
 
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మంచి మెలోడీ పాటను విడుదల చేశారు. పరవశమే అంటూ సాగే ఈ పాట శ్రోతలకు ఎంతో వినసొంపులా ఉంటుంది. విజయ్ బుల్గానిన్ బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. చైతన్య వర్మ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్ గాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి.
 
ఈ చిత్రానికి రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
నటీనటులు : అద్వైత్ ధనుంజయ , అతుల్యా చంద్ర, అవంతిక నల్వా తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు