దిషా పటానీ.. నిన్ను చంపేస్తాం అంటూ మెగా బ్యూటీకి వార్నింగ్ కాల్స్

శుక్రవారం, 22 జనవరి 2021 (14:43 IST)
మెగా బ్యూటీ దిషా పటానికి పాకిస్తాన్ నుండి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఆమెకి నేరుగా కొందరు గుర్తు తెలియని దుండగలు ఫోన్ చేసి.. దిషా నిన్ను చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారట. అంతేకాదు నేరుగా పోలీసు స్టేషనుకు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయట. దిషాను చంపేస్తాం.. ఆమె ప్రాణాలను మీరు కాపాడలేరు అంటూ కాల్ చేసారట. ఐతే ఈ కాల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు తేలిందట. దీనితో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా మెగా బ్యూటీ దిషా పటాని అద్భుతమైన లుక్స్‌తో లోఫర్‌ చిత్రంలో వరుణ్ తేజ్‌తో నటించింది. ఆ తర్వాత, ఆమె ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ, బాఘి 2, బాఘి 3, సల్మాన్ ఖాన్ భారత్ వంటి చిత్రాలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరోసారి సల్మాన్ ఖాన్ తీస్తున్న రాధేలో రొమాన్స్ చేస్తోంది.
 
స్టార్టర్స్ కోసం, దిషా పటాని కుంగ్ ఫూ యోగాలో హాలీవుడ్ నటుడు జాకీ చాన్‌తో నటించింది. ఈ చిత్రం చైనాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసింది. ఆమె ఏక్తా కపూర్ యొక్క క్టినాలో కూడా నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు