టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. చిరంజీవి నుంచి ఈ మధ్యే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వరకూ ఆల్ మోస్ట్ అందరూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. అయితే వీరంతా ఒకరి సినిమాకు మరొకరి సినిమాతో పోటీ ఉండకుండా సినిమాల రిలీజ్ లను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వరుసగా ఒక్కోవారం గ్యాప్లో ముగ్గురు మెగా హీరోలు పోటీకి రెడీ అవుతున్నారు.
గతంలో ఇమేజ్ కోసం పోటీ పడుతున్న హీరోలే తన సినిమాలను పోటీ లేకుండా రిలీజ్ చేసుకుంటుంటే, ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కేవలం ఒక్కో వారం గ్యాప్తో ముగ్గురు మెగా హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. అందరికంటే ముందుగా ఈ నెల 24న సాయిధరమ్ తేజ్ తన కొత్త సినిమా "సుబ్రమణ్యం ఫర్ సేల్" సినిమాతో రెజీనాతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.