ఈ కారణంగానే ఈ సినిమాలో ఇంతవరకూ తాను చేసిన సీన్స్కి డబ్బింగ్ చెప్పుకోవడానికి చిరంజీవి రంగంలోకి దిగారు. శనివారం నుంచే ఆయన తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో వెరైటీగా ప్లాన్ చేసే పనిలో చరణ్ వున్నాడు. ఈ సినిమాకి గల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వినాయక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.