నా ట్రైలర్ చూసి చిరంజీవి పడిపడి నవ్వారు.. సదా ఆయన ప్రేమకు బానిసను : సంపూర్ణేష్ బాబు

ఆదివారం, 29 మే 2016 (16:05 IST)
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం 'కొబ్బరిమట్ట'. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతున్నారు. అలాగే, ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి కూడా తిలకించారు. ఈ ట్రైలర్ చూశాక ఆయన పడిపడి నవ్వారని ఆ చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. 
 
'కొబ్బరి మట్ట ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతగానో నవ్వి... మమ్మల్ని, మా కొత్త ఐడియాలను అభినందించారు. ఇది నా జీవితంలో చాలా గొప్పరోజు. 'కొబ్బరిమట్ట' చిత్రం నాకు ముఖ్యమైన సినిమా. చిరంజీవిగారి దీవెనలతో ఇక వెనుదిరిగే సమస్యే లేదు. సదా ఆయన ప్రేమకు బానిసను' అంటూ సంపూర్ణేష్ బాబు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా చిరంజీవితో ఆయన కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి