మళ్లీ మోహన్ లాల్ సరసన నటి త్రిషా

గురువారం, 18 ఆగస్టు 2022 (19:39 IST)
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగిన నటి మీనా ఇటీవలే భర్తను కోల్పోయింది. దాదాపు 45 రోజుల క్రితం ఆమె భర్త సాగర్ అకాల మరణం చెందారు. ప్రస్తుతం ఈ విషాదం నుంచి క్రమంగా కోలుకుంటున్న మీనా... త్వరలోనే మలయాళ నటుడు మోహన్ లాల్ సరసన నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "దృశ్యం" చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. జీత్తు జోసఫ్ దర్శకత్వం వహించారు. 
 
లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళా పోలీసు అధికారి కొడుకును హత్య చేసిన తన వాళ్ళను రక్షించే తండ్రి కథే దృశ్యం. రూ.5 కోట్లు ఖర్చు చేసిన ఈ చిత్రం రూ.75 కోట్లు వసూలు చేసింది. దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి నటించిన పాపనాశం అనే పేరుతో రీమేక్ అయింది. హిందీ, తెలుగు, కన్నడ భాషలలో ఇప్పుడు రీమేక్ చేశారు. 
 
ఇపుడు మూడో భాగాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో కూడా మోహన్ లాల్, మీనా జంటగా నటించేలా చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు