సోషల్ మీడియాలో ఎవరో ఓ నెటిజన్ చేసే పోస్ట్/ట్వీట్ ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెడుతుందో ఈ తాజా ఘటనే ఉదాహరణ. ప్రముఖ ప్రముఖ బెంగాలీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్ హాయిగా జీవించి వుంటే.. ఆయన చనిపోయినట్టు ఎవరో చేసిన ఓ ట్వీట్.. ఇపుడు సోషల్ మీడియాలో వైరల్లా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
93 యేళ్ళ మృణాల్ సేన్ అనారోగ్యంతోనే జీవిస్తున్నారు. అయితే, ఆయన బతికుండగానే చనిపోయారంటూ సోషల్మీడియాలో రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది నిజమనుకుని దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం కూడా తెలిపారు. చాలా వెబ్సైట్లు, కొన్ని చానెళ్లు ఆయనకు నివాళిగా ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేశాయి.