కోహ్లీపై మనసుపడ్డాను... అనుష్క తనకు కాకుండా చేసింది..

శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (10:13 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ఏ అమ్మాయి ఇష్టపడరు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి మృణాళ్  ఠాగూర్ ఒకరు. తాను కూడా అందరి అమ్మాయిల్లాగానే విరాట్ కోహ్లీపై మనస్సుపడ్డాను. కానీ, ఆ అవకాశాన్ని అనుష్క దక్కించుకుంది అంటూ మృణాళిని వాపోతున్నారు. ఈమె 'సూప‌ర్ 30', 'బ‌ట్లా హౌజ్‌', 'ఘోస్ట్ స్టోరీస్'తోపాటు ప‌లు చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
కోహ్లీతో తన వన్‌సైడ్ ప్రేమపై ఆమె స్పందిస్తూ, తాను ఒక‌ప్పుడు విరాట్ కోహ్లీ పిచ్చిగా ప్రేమ‌లో ప‌డ్డాన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో హిందీలో రీమేక్ అవుతున్న జెర్సీలో న‌టిస్తోంది. షాహిద్ క‌పూర్‌తో రొమాన్స్ చేయ‌బోతుంది. 
 
ఈ సంద‌ర్భంగా చేసిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ "నా సోద‌రుడి వ‌ల్లే నేను క్రికెట్ ఇష్ట‌ప‌డ‌టం మొదలుపెట్టా. ఆ ఓ టైంలో విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమ‌లో ప‌డిపోయా. ఐదేళ్ల క్రితం ఓ స్టేడియంలో మ్యాచ్ లైవ్ జ‌రుగుతుంటే విరాట్ కోహ్లీ ప‌క్క‌న కూర్చొని వీక్షించాను. అప్పుడు నీలి రంగు జెర్సీ వేసుకుని భార‌త టీం త‌రుపు చీర్స్ చేశారు. క‌ట్ చేస్తే.. ఇవాళ క్రికెట్ మీద వ‌స్తున్న జెర్సీ సినిమాలో న‌టిస్తున్నా. ఇలాంటి చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డం చాలా సంతోషంగా ఉంది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న జెర్సీ నవంబ‌ర్ 5న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు