''ఊపిరి''కి తర్వాత నిఖిల్‌తో మల్టీస్టారర్‌కు అక్కినేని నాగార్జున రెడీ

మంగళవారం, 3 జనవరి 2017 (16:27 IST)
2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని నాగార్జున ఉవ్విళ్లూరుతున్నారు.

నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత నటిస్తున్న 'కేశవ' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నిఖిల్ సినిమాను 'ప్రేమమ్‌'తో ఇటీవల మంచి సక్సెస్‌ అందుకున్న దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్నారట. 
 
ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం తన తర్వాతి చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' పనుల్లో బిజీగా ఉన్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి