హోటల్‌లో ఒంటరిగా ఆహారం తీసుకుంటున్న బాలయ్య (వీడియో)

బుధవారం, 25 అక్టోబరు 2017 (19:18 IST)
కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. బాలయ్య సరసన నయనతార నటిస్తోంది. నటాషా అనే మలయాళ ముద్దుగుమ్మ బాలయ్య కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్య 102 సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ని ''జై సింహా''గా ఫిక్స్ చేసినట్లు తెలసింది. బాలయ్య కెరీర్‌లో ''సింహ" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 
 
ప్రస్తుతం అదే ''సింహా''కు ముందు "జై"కి యాడ్ చెయ్యడంతో ఈ సినిమా కూడా అంతే పవర్ ఫుల్ హిట్ అందుకుంటుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఈ మూవీకి ''కర్ణ'' అనే టైటిల్‌ని కూడా అనుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ  నేపథ్యంలో బాలయ్య ఓ హోటల్‌లో ఒంటరిగా కూర్చుని ఆహారం తీసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఓ హోటల్‌లో బాలయ్య ఆహారం తీసుకుంటుండగా.. ఆయన పక్కన ఎవ్వరూ లేరు. సెక్యూరిటీ కూడా పెద్దగా లేదు. సాధారణ మనిషిలా ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆహారం తీసుకుంటూ బాలయ్య కనిపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియోను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోపై బాలయ్య అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన స్టార్‌డమ్‌ని సైతం బాలకృష్ణ లెక్కచేయరని, చాలా సింపుల్‌గా ఉంటారని కితాబిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు