క్విజ్ షోకు డేట్స్ ఇచ్చిన ఎన్‌.టి.ఆర్‌.

మంగళవారం, 13 జులై 2021 (16:25 IST)
Ntr show
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం తుది దశ షూటింగ్ లో ఉంది. ఇక ఇంకోవైపు ఎన్‌.టి.ఆర్‌. టీవీ కోసం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ క్విజ్ షోకు డేట్స్ ఇచ్చాడ‌ట‌. ఇటీవ‌లే దీనికి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఆ త‌ర్వాత క‌రోనావ‌ల్ల అస‌లు షూటింగ్ వుంటుందా? లేదా? అనే సందేహం కూడా వ‌చ్చింది. ఇప్పుడు ప‌రిస్థితులు అనుకూలంగా వున్నాయ‌ని అందుకే ప్రారంభించార‌ట‌.
 
ఇంత‌కుముందు క‌రోనా వ‌ల్ల ఈ షో షూటింగ్ ఆగిపోయింది. అందుకే ఇప్పుడు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తిగా నిర్వ‌హించి సెట్‌లోకి అనుమతిస్తున్నారు. ముందుగా సాంకేతిక సిబ్బందికి ప్ర‌త్యేకంగా జెమిటీ టీవీ యాజ‌మాన్యం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. క‌రోనా టీకాలు వేసుకున్న వారికే అనుమ‌తి ఇస్తుంది. క్విజ్ షోకు సంబంధించిన ఎపిసోడ్ల చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఈ షో కోసం పదిరోజుల పాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి స‌రికొత్త‌గా షో వుండేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో టీవీ యాజ‌మాన్యం ప్ర‌క‌టించ‌నుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు