కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు: గుర్రం మృతి చెందడంతో..!

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (12:41 IST)
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన చారిత్రక చిత్రం పొన్నియన్ సెల్వన్ సెట్‌లో ఇటీవల ఓ గుర్రం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు నమోదు చేశారు. 
 
గుర్రం అలసట, డిహైడ్రేట్‌కు గురయ్యిందని, అయినప్పటికీ దానిని షూటింగ్‌లో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని పెటా ఇండియా ఆరోపించింది. నిజమైన జంతువులను ఉపయోగించకుండా, కంప్యూటర్ గ్రాఫిక్‌లను వాడాలని అందరూ చిత్రనిర్మాతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని పెటా ఇండియా అన్ని జంతు సంక్షేమ బోర్డులను అభ్యర్థించింది. మరి ఈ కేసుపై మణిరత్నం ఎలా స్పందిస్తారో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు