తన తాజా చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఓ చానెల్కు ప్రకాష్ రాజ్ వెళ్లారు. సినిమా విశేషాల గురించి అడుగుతూ వచ్చిన యాంకర్ ఉన్నట్టుండి తమిళనాడు, కర్ణాటకల మధ్య ముసురుకున్న కావేరీ జల వివాదాలపై ప్రశ్న సంధించింది. అడిగింది. దీంతో ప్రకాష్ రాజ్ సహనం కోల్పోయారు.
‘సినిమా గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ఈ ప్రశ్న అవసరమా? మాట్లాడుకోవడానికి బోలెడు సమస్యలున్నాయి. రైతుల సమస్యల గురించి మాట్లాడొచ్చు. కానీ, కావేరి జల వివాదాల గురించి నా స్పందనను చెప్పించి వివాదం సృష్టించాలనుకుంటున్నారా’ అంటూ మైక్రోఫోన్ తీసి విసిరికొట్టాడు.